అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రపంచ దేశాలకు అదనపు సుంకాలపై హెచ్చరికలు జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా, అవసరమైతే సెక్షన్ 301 కింద సుంకాలు విధించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో, అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీషన్ గ్రీర్ భారత్ పర్యటనలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో తొలి విడత భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై చర్చలు జరిపారు. ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం ఖరారు దిశగా కీలక పురోగతి సాధించాయని ప్రకటించాయి.