ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఆకట్టుకున్న వైభవ్ బ్యాటింగ్కు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ‘అభిమన్యుడి యుద్ధం’ ప్రసంగాన్ని జోడిస్తూ ఓ నెటిజన్ చేసిన క్రేజీ ఎడిట్ వైరల్ అవుతోంది. వైభవ్ పోరాటానికి చాగంటి వాయిస్ పర్ఫెక్ట్గా సరిపోవడంతో క్రికెట్ అభిమానులు వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.