ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ను భారీ దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీశాడు. అతను వేసిన 8వ ఓవర్లో లివింగ్స్టన్, హ్యారీ బ్రూక్ను వెంట వెంటనే పెవిలియన్కు పంపాడు. దీంతో ఇంగ్లాండ్ 72 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్ ( 46*) బేతెల్ (2*) ఉన్నాడు.