కేరళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ శుక్రవారం మర్యాదపూర్వంగా కలిశారు. విజయన్ సతీషన్కు సాదర స్వాగతం పలికి, సీఎంగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. అనంతరం, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.