AP: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ను మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు మెంబర్లు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత రంగనాయక మండపంలో వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అందజేశారు.