యూపీలోని నోయిడాలో సెగ్మెంట్-144లో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో శటరింగ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో శిధిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కార్మికులను పోలీసులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఇద్దరు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సూపర్వైజర్, కాంట్రాక్టరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.