మహారాష్ట్ర లోనవాలాలోని ప్రసిద్ధ భుషి డ్యామ్ భారీ వర్షాల కారణంగా ఓవర్ఫ్లో అవుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. డ్యామ్ నుండి నీరు పొంగిపొర్లుతుండగా.. గత 24 గంటల్లోనే 116 మి.మీ. వర్షపాతం నమోదైంది. పర్యాటకులు డ్యామ్ సందర్శన వేళ జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.