రాజస్థాన్లోని జలోర్ జిల్లా చితల్వానాలో షాకింగ్ ఘటన జరిగింది. నాగ్ సింగ్ రాజ్పుత్ అనే వృద్ధుడు తన ఇంటి వెలుపల నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక వీధి ఎద్దు అతనిపై ఒక్కసారిగా దాడి చేసింది. ఆ ఎద్దు అతనిని కొమ్ములతో గాల్లోకి ఎగరేసి కిందపడేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంతో వీధి పశువుల బెడదపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.