కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో సింధనూరులో ఒక మహీంద్రా థార్ కారు బీభత్సం సృష్టించింది. కాలేజీ ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు విద్యార్థినులపైకి ఒక థార్ కారు అతివేగంగా రివర్స్లో దూసుకొచ్చింది. ఈ భయంకరమైన ప్రమాదంలో 17 ఏళ్ల విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు అమ్మాయిలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.