తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. తిరుచెంగోడ్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఒక స్కోడా రాపిడ్ కారు అతివేగంతో వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేంద్రన్ బాబు (58) అనే వ్యక్తి,, అతని భార్య తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.