దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తూ, భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఈ నెల 10, 11 తేదీల్లో మూడు అత్యంత ప్రాధాన్యమైన క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) వ్యవస్థ, యాంటీ-షిప్ వార్ఫేర్ సామర్థ్యాలు, సుదూర లక్ష్యాలను నిర్వీర్యం చేయడంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించింది. నావల్ యాంటీ షిప్ మిసైల్-మీడియం రేంజ్ (NASM-MR) తొలి ప్రయోగ పరీక్ష కూడా విజయవంతమైంది. ఈ విజయాలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీఓ శాస్త్రవేత్తలను, సాయుధ దళాలను అభినందించారు.