HYD-బీఆర్కే భవన్లోని కమిషన్ ఎదుట కాళేశ్వరం కమిషన్ విచారణకు శుక్రవారం BRS నేత హరీశ్ రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల ఆధారంగా హరీశ్ను విచారించే ఛాన్స్ ఉంది. అయితే గురువారమే కాళేశ్వరం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. కేసీఆర్ హెల్త్ చెకప్ కారణంగా హరీశ్ వెళ్లలేకపోయారు. గతంలో ఇచ్చిన వాంగ్మూలం, ప్రభుత్వ కేబినెట్ నోట్స్ మధ్య తేడాలు ఉన్నట్లు ఘోష్ కమిషన్ గుర్తించి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.