ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సోమనాథుడికి అభిషేకం చేశారు. అంతకుముందు, ఆయన శౌర్య యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో సోమనాథ్ ఆలయ విశిష్టతను తెలిపే శకటాలు ప్రదర్శించబడ్డాయి, ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి.