మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా కరంజా నగరంలో ఒక వీధికుక్క తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీ వేస్ ప్రాంతంలో ఓ పండ్ల వ్యాపారిపై క్రూరమైన కుక్క ఒక్కసారిగా దాడి చేసి శరీరంపై పలుచోట్ల విచక్షణారహితంగా కరిచింది. బాధితుడు కర్రతో దానిని తోలేసేందుకు ప్రయత్నించినప్పటికీ, కుక్క ఆగకుండా దాడి చేస్తూనే ఉంది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గాయపడిన వ్యాపారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.