యూపీలోని కాన్పూర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో రైల్వే పట్టాలు కుంగిపోయాయి. ఈ నేపథ్యంలో కాలిండి ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా ట్రాక్ పై నిలిచిపోయింది. ట్రైన్ను అకస్మాత్తుగా ఆపడంతో ప్రయాణికుల మధ్య ఆందోళన నెలకొంది. ప్రయాణికులు భయంతో పక్కనే ఉన్న హైవేపైకి పరుగులు తీసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.