ముంబైలోని చెంబూరు పరిధిలో మంగళవారం షాకింగ్ ప్రమాదంజరిగింది. విద్యార్థులతో వెళ్తున్న ఒక స్కూల్ బస్సుపై ఒక్కసారిగా భారీ వృక్షం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల పాఠశాల విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బస్సులో ఉన్న మరో 10 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.