తమిళనాడులో అజిత్కుమార్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు పోలీస్ కస్టడీలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను టీవీకే పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించిన ర్యాలీలో కూడా పాల్గొని డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో డీఎంకే పార్టీ సీఎం స్టాలిన్ స్పందించారు. నటుడు విజయ్ ముందుగా బేసిక్ రాజకీయాలు తెలుసుకోవాలని,. కస్టోడియల్ డెత్లో పోలీసులు నిందితులుగా ఉన్నారని, ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారని తెలిపారు.