విశాఖలో క్రూజ్ టెర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది. ఐసీటీగా పిలిచే దీన్ని రూ.96.05 కోట్లతో కేంద్ర పర్యాటకశాఖ (రూ.38.50 కోట్లు), విశాఖ పోర్టు ట్రస్ట్ (రూ.57.55 కోట్లు) సంయుక్తంగా నిర్మించాయి. దీన్ని రెండు వేల మందిని తీసుకెళ్లగల సామర్థ్యం గల క్రూజ్లు నిలిపేందుకు వీలుగా సిద్ధం చేశారు. కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ సేవా కౌంటర్లు, రిటైల్ అవుట్లెట్లు, డ్యూటీఫ్రీ షాపులు, ఫుడ్ కోర్టులు, లాంజ్లతో టెర్మినల్ సిద్ధమైంది.