TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ జూనియర్ కళాశాలలో ఓటర్ల జాబితా సవరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లు దాటిన యువతకు కొత్తగా ఓటు నమోదు చేపట్టాలని ఎన్నికల సంఘం సెల్ డిప్యూటీ సీఈవో రాంప్రసాద్ సూచించారు. ఎలక్టోరల్ లిట్రసీ క్లబ్ను ఏర్పాటు చేసి, ప్రతి యువతీ యువకులకు ఓటు నమోదు చేయించి, ఓటరు ఐడీ కార్డు ఇప్పించాలని తెలిపారు.