క్రూడాయిల్ ధరలపై యుద్ధం ప్రభావం చూపుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిని మూసివేసింది. చమురు రవాణా నౌకలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ కాంట్రాక్టు బ్యారెల్కు 10 శాతం పెరిగింది. ఇది భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. బ్యారెల్కు ఒక డాలర్ పెరిగినా, ఏడాదికి భారత్పై రూ.13 వేల కోట్ల భారం పడుతుందని అంచనా. దీంతో భారతీయుల్లో ఆందోళన నెలకొంది.