మిడిల్ఈస్ట్ ఉద్రిక్తతల ప్రభావంతో పాకిస్థాన్లో తీవ్ర ఇంధన సంక్షోభం నెలకొంది. ముడి చమురు కొరత కారణంగా ప్రభుత్వం ‘ఆయిల్ సేవింగ్ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు స్కూళ్లు, కాలేజీలకు తాత్కాలిక సెలవులు ప్రకటించగా, ప్రభుత్వ-ప్రైవేటు సంస్థల్లో 50% వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నారు. వారానికి నాలుగు రోజుల పని విధానం కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ పెట్రోల్ ధరలు పాకిస్థానీ కరెన్సీలో రూ.321 దాటగా, డీజిల్ రూ.335కు చేరింది.