హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరి సమక్షంలో భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్కు అధికారిక నియామకపత్రాన్ని అందజేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని బట్టు కర్ణాకర్ తెలిపారు.