భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (ఎం) పార్టీలు ఉమ్మడిగా తమ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించాయి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఈ ప్రకటన చేశారు. ప్రజల్లో మంచి పేరు, పార్టీ పట్ల నిబద్ధత కలిగిన నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.