భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో, 18, 10, 25, 22, 30వ వార్డుల్లో ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముక అని, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.