భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లింగాల గ్రామానికి చెందిన తిప్పారపు నాగరాజు పొలం నుంచి ఇంటికి వస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల, మలహర్ మండలాల్లో కురిసిన అకాల వర్షం, గాలివాన కారణంగా ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. రహదారులపై చెట్లు కూలి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.