టేకుమట్ల మండలంలోని రామకృష్ణాపుర్ గ్రామంలో ఆదివారం నాడు అగ్నిప్రమాదం సంభవించింది. రైతు బోయ రమేష్కు చెందిన మూడు ఎకరాల మొక్కజొన్న పంట కాలిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతు బోయ రమేష్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నాడు.