మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో అనూష (30) అనే మహిళ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం ఆత్మహత్య చేసుకుంది. సాయి నగర్ లో నివాసం ఉంటున్న ఆమె, మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.