నర్సింహులపేట: కొత్త బట్టలకు డబ్బులు ఇవ్వలేదని యువతి సూసైడ్

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన నాగన్నబోయిన మనీషా(22) బాబాయ్ కుమార్తె వివాహానికి తనకు కొత్త బట్టలకు డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఈ నెల 6న పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు మహబూబాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై సురేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్