జనగామ పట్టణంలోని ఫ్లైఓవర్పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బొలెరో వాహనం, బైకు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన నవీన్ అక్కడిక్కడే మృతి చెందారు. జనగామ మండలం శామీర్ పేట కు చెందిన అభిలాష్ కు తీవ్ర గాయాలు కావడంతో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అభిలాష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.