జనగామ పట్టణంలోని గణేష్ వాడలో మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ తో పాల వ్యాపారి ధర్మారెడ్డికి చెందిన బైక్ అగ్ని ప్రమాదానికి గురైంది. పడమటి గుంటూరు గూడెం గ్రామానికి చెందిన ధర్మారెడ్డి పట్టణంలో పాలు పోస్తుండగా ఈ ఘటన జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినా, అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది.