బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించే రైతు సంగ్రామ సదస్సుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపు మేరకు, జనగామ మండలం పెద్ద రాంచర్ల గ్రామం నుంచి బుధవారం పార్టీ శ్రేణులు భారీగా బయలుదేరాయి. హంటర్ రోడ్లో జరిగే ఈ సదస్సుకు పెద్ద ఎత్తున నాయకులు, పార్టీ కార్యకర్తలు, రైతులు తరలివెళ్లారు. ఈ సదస్సులో రైతుల సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.