అమరవీరుల త్యాగాలతో ఏర్పాటైన మేడేను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక గబ్బేట గోపాల్ రెడ్డి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, రాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.