జనగామ జిల్లా లింగాల ఘనపురంలో భర్తను భార్యలు గొడ్డలితో నరికి చంపిన ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. తాగిన మైకంలో అత్తను హత్య చేసిన కనకయ్యపై కోపంతో, బెయిల్పై రాగానే భార్యలు అతన్ని హతమార్చారు. ఈ ఘటనకు గ్రామస్తులు, కనకయ్య అక్క, చెల్లెలు సహకరించినట్టు తెలుస్తోంది. మైనర్ చెల్లెల్లపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడని వారు వెల్లడించారు.