జనగామ జిల్లాలో ఆదివారం పలు చోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షానికి రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్ యార్డులో వరదలో ధాన్యం కొట్టుకుపోయింది. జనగామ, లింగాల గణపురం, రఘునాథపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి నేలరాలింది. పలుచోట్ల రహదారులపై చెట్లు నేల కూలాయి.
తడిసిన ధాన్యాన్ని మాయిశ్చర్ లేకుండా ప్రభుత్వంకొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు.