జనగామ జిల్లాలో పెద్ద పులి ప్రవేశించిందనే ప్రచారం అవాస్తవమని జనగామ అటవీ శాఖ అధికారి (ఎఫ్ ఆర్ ఓ) కొండల్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక పరిసరాల నుంచి బుధవారం తెల్లవారుజామున టంగుటూరు, శారాజీపేట వైపు పులి వెళ్లిందని ఆయన తెలిపారు. జనగామ జిల్లాలో పులి సంచారంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, పొరుగు గ్రామాల్లో సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.