గూడూరు: తల్లిని రైతువేదికలో వదిలేసిన నలుగురు కొడుకులు

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భూపతి పేట గ్రామంలో కన్న తల్లిని కాదన్న కొడుకుల ఘటన గురువారం చోటుచేసుకుంది. తల్లిని సాదలేము అంటూ రైతు వేదికలో నలుగురు కొడుకులు వదిలి పెట్టారు. నలుగురు కొడుకులకు భారంగా మారిన కన్నతల్లి రైతువేదికలో తల దాచుకుంటుంది. తేలిక పాటి చద్దరితో చలికి తట్టుకోలేక వణుకుతున్న ఆమె పరిస్థితిని చూసి స్థానికులు కొడుకులు చేసిన పని పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చోరవ చూపాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్