తెలంగాణ మైనారిటీ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం షీ టీం ఎస్ఐ సునంద గంజాయి, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, మహిళల రక్షణ చట్టాలు, పోక్సో, ర్యాగింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చదువు ద్వారా ఎక్కడైనా బ్రతకవచ్చని, మత్తు పదార్థాల గురించి సమాచారం ఉంటే యాజమాన్యానికి లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తత కలిగి ఉండాలని పేర్కొన్నారు.