మహబూబాబాద్ పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై దాడులు చేయడం సరైన చర్య కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను పిలిచి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆపరేషన్ కగార్ ఆపేవరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.