మహబూబాబాద్ లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సందర్శించి కళాశాలలో సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో, కళాశాల అధ్యాపకులతో, సిబ్బందితో మాట్లాడి కళాశాల లోని సదుపాయాల పై ఎమ్మెల్యే మురళి నాయక్ పలు సూచనలు చేశారు. ఎప్పుడు సీసీ టీవీ పర్యవేక్షణలో కళాశాల నిర్వహించాలని సూచించారు.