12న సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ

ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కార్యదర్శి జయరాజు పిలుపునిచ్చారు. మంగళవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించి, వారిని స్వచ్ఛంద సేవకులుగా కాకుండా రెగ్యులర్ కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైద్యాధికారి కిషోర్కు అందజేశారు.

సంబంధిత పోస్ట్