మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం పిల్లి గుండ్ల తండాలో దుర్గమ్మ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్న బానోత్ బిచ్చ (54) అనే వ్యక్తికి ఆహారం గొంతులో ఇరుక్కుపోయి మృతి చెందారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో, కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం మృతుని కుమారుడు బానోత్ నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.