మేడారం జాతర సందర్భంగా భక్తులను తరలించడానికి అంబులెన్స్లను అక్రమంగా ఉపయోగించుకుంటున్నారని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రవాణా వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ములుగు డీఎంహెచ్వో ఆఫీస్ సిబ్బంది, ఎసెన్షియల్ సప్లైస్ వెహికల్ పాస్తో, సైరన్ వేసుకుంటూ అత్యవసర సేవలుగా నటిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారని, డాక్టర్ల కుటుంబాలను నేరుగా మహాద్వారం వరకు తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.