ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలంలోని చంద్రుతండ, కర్లపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్యను మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పరిష్కరించారు. ఎన్నికల హామీ మేరకు రెండు గ్రామాల్లో మంచి నీటి బోర్లు ఏర్పాటు చేయడంతో, ఎన్నాళ్లుగానో నీటి కొరతతో బాధపడుతున్న ప్రజలకు ఊరట లభించింది. హామీని నిలబెట్టుకున్న మంత్రి సీతక్కకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.