గోదావరి వరద ఉప్పొంగిన నేపథ్యంలో ములుగు జిల్లా వాజేడు మండలం తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారిని మూసివేసినట్లు ములుగు ఎస్పీ శబరీశ్ తెలిపారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం వద్ద రేగుమాకువాగు పొంగి జాతీయ రహదారిపై నుంచి ప్రవహిస్తోందన్నారు. వరద ఉద్ధృతి తగ్గే వరకు స్థానికులు అటువైపు నుంచి ప్రయాణాలు చేయొద్దన్నారు. పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు.