మేడారం వనదేవతల సన్నిధిలో భక్తులు పోటెత్తడంతో గద్దెల ప్రాంగణమంతా భక్తజనంతో నిండిపోయింది. అయితే, భక్తులు తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్లు, కొబ్బరి చిప్పలను ఎక్కడపడితే అక్కడ పడేయడంతో అపరిశుభ్రంగా మారింది. ప్లాస్టిక్ రహిత జాతరలో ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు వెంటనే క్లిన్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.