మంగళవారం, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి ఆర్టీసీ సమ్మె కాలంలో ఆత్మబలిదానం చేసుకున్న కోల శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఆర్డీవో, శంకర్ గౌడ్ కుమారుడు హేమంత్కు త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.