ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల్ బయోడైవర్సిటీ పార్క్ లో బుధవారం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం జరిగింది. అదనపు కలెక్టర్, డీఎఫ్వో, ఆర్డీవో, ఎంఆర్డీ, ఎస్ఆర్ఎలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వ్యర్థాల నిర్వహణ, హరిత వాతావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైకిల్ డే కార్యక్రమం కూడా నిర్వహించారు.