జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం 85 రోజులకు రూ. 18,04,055 సమకూరినట్లు ఈఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. శుక్రవారం ఆలయ కల్యాణ మండపంలో కొడవటూరు ఈఓ చిందం వంశీ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. గతేడాది అక్టోబరు 9 నుంచి ఈ ఏడాది జనవరి 1 వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా, నగదుతో పాటు 88 డాలర్ల అమెరికా కరెన్సీ (13 నోట్లు) కూడా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.