పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్ది, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు తొర్రూరు మండలంలోని హచ్చు తండాకు చెందిన లబ్ధిదారుడు భానోత్ నాగమణి నరేందర్ కు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇవ్వకుండా మోసగించిందని, ప్రజా ప్రభుత్వం పేదలకు ఇండ్లు మంజూరు చేసి ఆదుకుంటుందని అన్నారు.