మేడారంలో ఏర్పాటు చేసిన 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు మినీ ఆస్పత్రులు పూర్తిగా నిండిపోయాయి. బెడ్లు ఖాళీ లేకపోవడంతో అనేక మంది భక్తులు ఆస్పత్రి ఆవరణలోనే చికిత్స కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం, తీవ్రమైన ఉక్కపోత, అలసట కారణంగా వందలాది మంది భక్తులు నీరసం, కీళ్ల నొప్పులు, శ్వాసకోస సంబంధిత సమస్యలతో అస్వస్థతకు గురవుతున్నారు.